విడుదలైన 'జవాన్' టీజర్

- July 31, 2017 , by Maagulf
విడుదలైన 'జవాన్' టీజర్

తిక్క , విన్నర్ ప్లాపుల తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం జవాన్. స్టార్ రైటర్ బీవీఎస్‌ రవి దర్శకత్వం లో మెహరీన్‌ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి సంబంధించిన ప్రీల్యూడ్‌ కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు..'కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత.' అంటూ సాయిధరమ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com