‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర షూటింగ్లో గాయపడిన ప్రగ్యాజైశ్వాల్
- July 31, 2017
యువ కథానాయకుడు మంచు విష్ణుతో పాటు తానూ గాయపడినట్లు ప్రగ్యాజైశ్వాల్ తెలిపారు. విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం పది రోజుల క్రితమే మలేషియా వెళ్లింది చిత్ర బృందం. ఆదివారం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో మంచు విష్ణు మోటార్ సైకిల్పై నుంచి కింద పడిపోయారు. మెడ, భుజంపై గాయాలు కావడంతో ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విష్ణుతో పాటు బైక్పైన ఉన్న ప్రగ్యాజైశ్వాల్ కూడా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తెలుపుతూ ‘జరిగిన ప్రమాదం గురించి తెలిసి స్పందించిన వారికి ధన్యవాదాలు. మంచు విష్ణు, నేనూ ఇద్దరం గాయపడ్డాం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తా. షూటింగ్ షెడ్యూల్ అర్ధంతరంగా ముగియడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నాం. మంచువిష్ణు త్వరలోనే మీతో మాట్లాడతారు’ అని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







