‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర షూటింగ్లో గాయపడిన ప్రగ్యాజైశ్వాల్
- July 31, 2017
యువ కథానాయకుడు మంచు విష్ణుతో పాటు తానూ గాయపడినట్లు ప్రగ్యాజైశ్వాల్ తెలిపారు. విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం పది రోజుల క్రితమే మలేషియా వెళ్లింది చిత్ర బృందం. ఆదివారం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో మంచు విష్ణు మోటార్ సైకిల్పై నుంచి కింద పడిపోయారు. మెడ, భుజంపై గాయాలు కావడంతో ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విష్ణుతో పాటు బైక్పైన ఉన్న ప్రగ్యాజైశ్వాల్ కూడా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తెలుపుతూ ‘జరిగిన ప్రమాదం గురించి తెలిసి స్పందించిన వారికి ధన్యవాదాలు. మంచు విష్ణు, నేనూ ఇద్దరం గాయపడ్డాం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తా. షూటింగ్ షెడ్యూల్ అర్ధంతరంగా ముగియడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నాం. మంచువిష్ణు త్వరలోనే మీతో మాట్లాడతారు’ అని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









