ఉదయం పూట కేకులు తినొద్దు.. నూడుల్స్ వద్దే వద్దు
- July 31, 2017
అల్పాహారంపై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. నోటికి ఏవి దొరికితే అవి తిని సరిపెట్టుకునే వారు చాలామంది వున్నారు. అయితే అల్పాహారంగా ఏవి పడితే అవి తినకూడదు. ఉదయం పూట కేకులు తినడం సరికాదు. ఇందులో పంచదార, వెన్న ఎక్కువగా ఉంటుంది. అందుచేత వీటిని ఉదయం తినడం ద్వారా శరీరంలో ఎక్కువ కెలోరీలు చేరిపోతాయి. ఇంకా బంగాళాదుంపలను అల్పాహారంలో తీసుకుంటే పొట్టలో ఇబ్బందితో అసౌకర్యానికి గురవుతారు.
ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపతో చేసిన స్నాక్స్కి దూరంగా ఉండటం మంచిది. కొందరు పండ్ల రసాలను ఫ్రిజ్లో వుంచుతారు. వాటిని తాగడం ద్వారా కడుపులో బ్యాక్టీరియా చేరుతుంది. ఇక అల్పాహారంలో నూడుల్స్ తీసుకోవద్దు. వాటిలో సోడియం అధికం. అలాగే రాత్రిపూట మిగిలిన చికెన్ వంటకాలను ఫ్రిజ్లో వుంచి మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







