హైదరాబాద్లో టీ20.. వైజాగ్లో వన్డే వేదికలు ఖరారు చేసిన బీసీసీఐ
- August 01, 2017
వేదికలు ఖరారు చేసిన బీసీసీఐ
స్వ దేశీ సీజన్లో టీమ్ఇండియా మ్యాచ్ల వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబరు నుంచి డిసెంబరు ఆఖరి వరకు స్వదేశంలో భారత జట్టు 23 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్లను ఆడనున్న భారత జట్టు శ్రీలంకతో మూడేసి టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్ను ఆడనుంది. మంగళవారం బీసీసీఐ పర్యటనల ప్రణాళిక కమిటీ ఈ మ్యాచ్ల వేదికలను ప్రకటించింది. ఆస్ట్రేలియాతో టీ20కి హైదరాబాద్, శ్రీలంకతో వన్డేకు వైజాగ్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఐతే మ్యాచ్ల తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు కోల్కతా, దిల్లీ, నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
సిరీస్లు, వేదికల వివరాలు:
ఆస్ట్రేలియా సిరీస్: వన్డేలు (5): చెన్నై, బెంగళూరు, నాగ్పూర్, ఇండోర్, కోల్కతా టీ20లు (3): హైదరాబాద్, రాంచి, గువహాటి,
న్యూజిలాండ్ సిరీస్: వన్డేలు (3): పుణె, ముంబయి, కాన్పూర్ టీ20లు (3): దిల్లీ, కటక్, రాజ్కోట్,
శ్రీలంక సిరీస్: టెస్టులు (3): కోల్కతా, నాగ్పూర్, దిల్లీ వన్డేలు (3): ధర్మశాల, మొహాలి, వైజాగ్ టీ20లు (3): కోచి/తిరువనంతపురం, ఇండోర్, ముంబయి.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









