షార్జా రోడ్లపై కొత్త స్మార్ట్ రాడార్లు
- August 02, 2017
కొత్త స్మార్ట్ రాడార్లను షార్జా రోడ్లపై ఏర్పాటు చేయనున్నారు. ఈ రాడార్ల ఏర్పాటుతో రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఉల్లంఘనలకు పాల్పడేవారికి సంబంధించి లైవ్ వీడియోల్ని ఈ రాడార్లు రికార్డ్ చేస్తాయి. ఏ వేగంతో వెళ్ళినాసరే కారులోని అన్ని సీట్లలో ఉన్నవారినీ స్పష్టంగా చూపించడం ఈ రాడార్ల ప్రత్యేకత అని షార్జా పోలీస్ పెట్రోల్స్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ మొహమ్మద్ అల్ నక్బి చెప్పారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం సీటు బెల్టు పెట్టుకోని వ్యక్తి నుంచి 400 దిర్హామ్లు జరీమానాగా వసూలు చేస్తారు, అలాగే అతని ఖాతాలో 4 బ్లాక్ పాయింట్స్ నమోదవుతాయి. కారులో మిగతా ప్రయాణీకులు సీటు బెల్టు పెట్టుకోకపోతే డ్రైవర్కి అదనంగా మరో 400 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. ఇతర వాహనాలతో సరైన గ్యాప్ పాటించకపోవడం, హెవీ వెహికిల్స్కి సంబంధించి ప్రత్యేక లేన్ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









