ఇకపై భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖతర్ ప్రభుత్వం

- August 04, 2017 , by Maagulf
ఇకపై భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖతర్ ప్రభుత్వం

ఇకపై ఖతర్ అభివృద్ధికి విశేష కృషి చేసిన వలస దారులుగా గుర్తిస్తామని ఖతర్ ప్రభుత్వం ప్రకటించింది.  అంతేకాకుండా ఖతర్ నివాస గుర్తింపు కార్డులు పొందన వారికి ఖతర్ పౌరులకు అందే అన్ని సౌకర్యాలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.  వారి పిల్లలకు ఉచిత ఆరోగ్యం, విద్య అందించబడుతుందని తెలియజేసింది. మొత్తం 27లక్షల ఖతర్ జనాభాలో సుమారు 3 లక్షల మంది భారతీయులు ఉన్నారని వారు దీని వల్ల లాభపడే అవకాశం ఉందంటున్నారు.  ఖతర్ పౌరులుగా గుర్తింపు పొందన వారు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని తెలిపింది.  గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం కల్పించలేదు.  సౌదీ సహా మిగిలిన గల్ఫ్ దేశాలు ఖతర్‌‌పై కక్ష గట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com