తెలంగాణ క్లస్టర్ కు కేంద్రం ఆమోదం
- August 06, 2017
తెలంగాణలో రూ.437 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)కు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సమర్పించిన ప్రతిపాదనలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. 310 ఎకరాల్లో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు ఇది రెండో క్లస్టర్ కావడం గమనార్హం. అంతకుముందు 600 ఎకరాల్లో రూ.667 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన క్లస్టర్కు టీఎస్ఐఐసీ ప్రతిపాదనలు పంపగా సంబంధిత మంత్రిత్వ శాఖ జులైలో ఆమోదం తెలిపింది. ఈఎంసీ స్కీమ్ కింద ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం కేంద్రం సాయంగా అందిస్తుంది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 15 ఈఎంసీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









