చంద్రగ్రహణం, రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆలయాల మూసివేత
- August 06, 2017
చంద్రగ్రహణం నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాలను మూసివేయనున్నారు. గ్రహణం ఘడియలు సోమవారం రాత్రి 10.52 ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తవుతాయి. సోమవారం సాయంత్రం 4.30 నుంచి మంగళవారం వేకువజామున 2 గంటల వరకు క్లోజ్ చేయనున్నారు. మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరచి మందిర శుద్ధి, పుణ్యాహవచనం చేపట్టనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
స్వామివారికి అన్నిరకాల సేవలు పూర్తయిన తర్వాత మంగళవారం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే గ్రహణం సమయంలో కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతించమని, అన్నప్రసాద వితరణను నిలిపివేస్తామని స్పష్టంచేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం, భద్రాచలం రామాలయం, యాదగిరిగుట్ట ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









