తెలంగాణ వాసికి ఎడారి దారిలో ఆగని కన్నీళ్లు
- August 07, 2017
గల్ఫ్లో ఒంటెల కాపరిగా నగరవాసి యాతన
ఎడారి దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారి కష్టాల కన్నీళ్లు ఆగడంలేదు. రోజుకో బాధితుడి వ్యథ వెలుగు చూస్తోంది. పాతనగరంలోని తాలాబ్ చంచలం డివిజన్ ఆమన్నగర్కు చెందిన సయ్యద్ సాదిక్ సౌదీ అరేబియాలో పడుతున్న ఇబ్బందులపై కుటుంబ సభ్యులు సోమవారం ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. అతడిని ఎలాగైనా కాపాడి స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. సాదిక్ గత ఏడాది జూన్ 24న సౌదీ వెళ్లాడు. అక్కడి రియాద్ నగరంలో ఓ వ్యక్తి వద్ద సహాయకుడిగా ఉద్యోగం ఉందని వెళ్లేముందు ఏజెంటు చెప్పాడు. కానీ అక్కడికి వెళ్లాక యజమాని మాత్రం జనావాసాలకు దూరంగా ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరిగా పంపించడంతో అతడి పరిస్థితి దారుణంగా మారింది. మండుటెండల్లో మాడిపోతూ... 11 నెలలుగా వేతనాలు లేక తీవ్ర దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ బాధితుని వివరాలను విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ట్విట్టర్లో పంపించారు.
అతడిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎడారి ప్రాంతంలో సాదిక్ను మాసినగడ్డం, కమిలిపోయిన చర్మంతో దయనీయ స్థితిలో చూసిన కొందరు హైదరాబాద్ వాసులు అతని చిత్రాలను కుటుంబ సభ్యులకు పంపించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అమ్జదుల్లాఖాన్ ఈ చిత్రాలనూ కేంద్రమంత్రికి పంపించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







