వేర్వేరు సంఘటనలలో ముగ్గురు ప్రవాసీయుల మృతి
- August 09, 2017
మనామ: వేర్వేరు సంఘటనలలో ముగ్గురు ప్రవాసీయుల మృతి చెందడంతో గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులు కార్మికులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో బహ్రెయిన్ బే స్ట్రీట్లో ఆసియా దేశానికి చెందిన బాబు మార్కంటి ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో తన నిండు జీవితాన్ని కోల్పోయాడు.మరణించిన వ్యక్తి శుభ్రపరిచే సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరో ఘటనలో ఆగస్టు 7 వ తేదీన ఉదయం10 గంటల సమయంలో తూర్పు రిఫాలో తన కారులో ఆసియా దేశానికి చెందిన మరొక ప్రవాసీయుడు చనిపోయి ఉన్నట్లు కనుగొన్నారు. కాగా, మరణించిన వ్యక్తిని బాల్కర్ సింగ్ గా గుర్తించారు. అయన గ్లోబల్ కో డబ్ల్యూ .ఎల్. ఎల్. కంపెనీ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మూడవ సంఘటనలో,వ్యక్తి మంగళవారం ఉదయం అల్ జజీర్ బీచ్ వద్ద సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈ మూడు సంఘటనలు నిర్ధారిస్తూ అంతర్గత మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మరణించినవారి గురించిఏ ఇతర వివరాలను వెల్లడించలేదు. వారి భౌతికకాయాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు ట్వీట్ లో తెలిపింది. బాల్కర్ సింగ్ అనే డ్రైవర్ మరణం గూర్చి మరియు అల్ జజీర్ బీచ్ లో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







