జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ టెంపో..పది మంది దుర్మరణం

- August 10, 2017 , by Maagulf
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ టెంపో..పది మంది దుర్మరణం

గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని పాటిస్తున్నప్పటికీ కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొంత మంది డ్రైవర్లు మద్య సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరికొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ప్రయాణికులతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో దాదాపు 200 అడుగుల లోతు ఉన్న లోయలో జారిపడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారే బెల్ట్‌లో చెకినల్లా ప్రాంతంలోని ఓ భారీ లోయలో టెంపో పడిపోయిందని రియాస్పీ ఎస్‌ఎస్పీ తహి సాజద్ తెలిపారు. మృతదేహాలను దవాఖానకు తరలించినట్టు, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com