జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ టెంపో..పది మంది దుర్మరణం
- August 10, 2017
గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని పాటిస్తున్నప్పటికీ కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొంత మంది డ్రైవర్లు మద్య సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరికొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ప్రయాణికులతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో దాదాపు 200 అడుగుల లోతు ఉన్న లోయలో జారిపడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారే బెల్ట్లో చెకినల్లా ప్రాంతంలోని ఓ భారీ లోయలో టెంపో పడిపోయిందని రియాస్పీ ఎస్ఎస్పీ తహి సాజద్ తెలిపారు. మృతదేహాలను దవాఖానకు తరలించినట్టు, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







