కొడుకు చూడట్లేదంటూ కోర్టు మెట్లెక్కిన 'రేమండ్స్' అధినేత విజయ్ సింఘానియా
- August 10, 2017
సామాన్యుడికి ఉండే కష్టాలు ధనవంతులక్కూడా ఉంటాయి. కాకపోతే అవి కొన్ని వెలుగు చూసి వార్తల్లోకి వస్తాయి. కొన్ని నాలుగ్గోడల మధ్యే ఉండిపోతాయి. ఇలాంటి వాటికి వారేమీ అతీతులు కారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. రేమండ్ బ్రాండ్ పేరుతో పురుషుల వస్త్రాలు తయారు చేసి ఓ వెలుగు వెలిగిన విజయ్పథ్ సింఘానియాకు కూడా కొడుకు గౌతమ్ సింఘానియాతో కష్టాలు తప్పట్లేదు. తాను సంపాదించిన ఆస్తి అంతా తీసుకుని ఇప్పుడు తనను బయటకు గెంటివేశాడని కోర్టుకెక్కాడు. ముంబైలోని మలబార్ హిల్స్లో రేమండ్స్ సంస్థ నిర్మించిన 36 అంతస్తుల జేకే కాంప్లెక్స్లో ఒక డూప్లెక్స్ ఇల్లు రావల్సి ఉంది. అలాగే విజయ్ పథ్ మరో కుమారుడి అజయ్ పథ్ సింఘానియాకి కూడా 4 ఇళ్లు రావాల్సి ఉంది. ఆ సంస్థలోని రూ.1000 కోట్ల విలువైన షేర్లను గౌతమ్ పేర ఉండడంతో విజయ్ పథ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఓ అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ నిబంధనల ప్రకారం విజయ్ సింఘానియాకు నెలకు రూ.7 లక్షలతో పాటు, కనీస వసతి కల్పించాలి. అవి కూడా గౌతమ్ కల్పించడం లేదని విజయ్పథ్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









