కొడుకు చూడట్లేదంటూ కోర్టు మెట్లెక్కిన 'రేమండ్స్' అధినేత విజయ్ సింఘానియా
- August 10, 2017
సామాన్యుడికి ఉండే కష్టాలు ధనవంతులక్కూడా ఉంటాయి. కాకపోతే అవి కొన్ని వెలుగు చూసి వార్తల్లోకి వస్తాయి. కొన్ని నాలుగ్గోడల మధ్యే ఉండిపోతాయి. ఇలాంటి వాటికి వారేమీ అతీతులు కారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. రేమండ్ బ్రాండ్ పేరుతో పురుషుల వస్త్రాలు తయారు చేసి ఓ వెలుగు వెలిగిన విజయ్పథ్ సింఘానియాకు కూడా కొడుకు గౌతమ్ సింఘానియాతో కష్టాలు తప్పట్లేదు. తాను సంపాదించిన ఆస్తి అంతా తీసుకుని ఇప్పుడు తనను బయటకు గెంటివేశాడని కోర్టుకెక్కాడు. ముంబైలోని మలబార్ హిల్స్లో రేమండ్స్ సంస్థ నిర్మించిన 36 అంతస్తుల జేకే కాంప్లెక్స్లో ఒక డూప్లెక్స్ ఇల్లు రావల్సి ఉంది. అలాగే విజయ్ పథ్ మరో కుమారుడి అజయ్ పథ్ సింఘానియాకి కూడా 4 ఇళ్లు రావాల్సి ఉంది. ఆ సంస్థలోని రూ.1000 కోట్ల విలువైన షేర్లను గౌతమ్ పేర ఉండడంతో విజయ్ పథ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఓ అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ నిబంధనల ప్రకారం విజయ్ సింఘానియాకు నెలకు రూ.7 లక్షలతో పాటు, కనీస వసతి కల్పించాలి. అవి కూడా గౌతమ్ కల్పించడం లేదని విజయ్పథ్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







