చాల రోజులు తరువాత కొడుకు సినిమాలో తండ్రి
- August 10, 2017
సూపర్స్టార్ కృష్ణ.. 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు' 'గూఢాచారి 117' తదితర చిత్రాల్లో తన కుమారుడు ప్రిన్స్ మహేశ్బాబుతో కలిసి నటించారు. ఆ తర్వాత మహేశ్ కథానాయకుడిగా నటించిన 'రాజకుమారుడు', 'వంశీ', 'టక్కరి దొంగ' చిత్రాల్లో కృష్ణ అతిథి పాత్రల్లో కన్పించారు.
అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ తండ్రీకొడుకులు తెరపై కనువిందు చేయనున్నట్లు చిత్రవర్గాల సమాచారం. మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. ఇందులో కృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అదే నిజమైతే మళ్లీ ఈ తండ్రీకొడుకులను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పండుగే.
అంతేకాదు.. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడం విశేషం.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క మహేశ్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న 'స్పైడర్' చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







