గువామ్పై ఆ క్షిపణి 14 నిమిషాల్లో చేరుకుంటుందట
- August 11, 2017క్షిపణి ప్రయోగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉత్తరకొరియా.. అమెరికాపై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ద్వీప ప్రాంతమైన గువామ్పై ఉత్తర కొరియా ఒకవేళ క్షిపణులతో విరుచుకుపడితే అవి కేవలం 14 నిమిషాల్లోనే చేరుకొని నిర్దేశిత ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తాయని ఆ ప్రాంత హోమ్లాండ్ భద్రతా ప్రతినిధి జెన్నా తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడిన జెన్నా.. ఉత్తరకొరియా చర్యలపై గువామ్ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చిపడితే వెంటనే స్థానికులను 15 హెచ్చరిక వ్యవస్థల ద్వారా అప్రమత్తం చేస్తామని చెప్పారు. గువామ్లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.
గువామ్ సమీపంలో క్షిపణి దాడులకు విస్తృత ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా గురువారం ప్రకటించిన నేపథ్యంలో జెన్నా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గువామ్లో దాదాపు 7 వేల మంది అమెరికా భ్రదతాసిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!