గువామ్‌పై ఆ క్షిపణి 14 నిమిషాల్లో చేరుకుంటుందట

- August 11, 2017 , by Maagulf
గువామ్‌పై ఆ క్షిపణి 14 నిమిషాల్లో చేరుకుంటుందట

క్షిపణి ప్రయోగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉత్తరకొరియా.. అమెరికాపై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ద్వీప ప్రాంతమైన గువామ్‌పై ఉత్తర కొరియా ఒకవేళ క్షిపణులతో విరుచుకుపడితే అవి కేవలం 14 నిమిషాల్లోనే చేరుకొని నిర్దేశిత ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తాయని ఆ ప్రాంత హోమ్‌లాండ్‌ భద్రతా ప్రతినిధి జెన్నా తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడిన జెన్నా.. ఉత్తరకొరియా చర్యలపై గువామ్‌ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చిపడితే వెంటనే స్థానికులను 15 హెచ్చరిక వ్యవస్థల ద్వారా అప్రమత్తం చేస్తామని చెప్పారు. గువామ్‌లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.
గువామ్‌ సమీపంలో క్షిపణి దాడులకు విస్తృత ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా గురువారం ప్రకటించిన నేపథ్యంలో జెన్నా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గువామ్‌లో దాదాపు 7 వేల మంది అమెరికా భ్రదతాసిబ్బంది ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com