గువామ్పై ఆ క్షిపణి 14 నిమిషాల్లో చేరుకుంటుందట
- August 11, 2017క్షిపణి ప్రయోగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉత్తరకొరియా.. అమెరికాపై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ద్వీప ప్రాంతమైన గువామ్పై ఉత్తర కొరియా ఒకవేళ క్షిపణులతో విరుచుకుపడితే అవి కేవలం 14 నిమిషాల్లోనే చేరుకొని నిర్దేశిత ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తాయని ఆ ప్రాంత హోమ్లాండ్ భద్రతా ప్రతినిధి జెన్నా తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడిన జెన్నా.. ఉత్తరకొరియా చర్యలపై గువామ్ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చిపడితే వెంటనే స్థానికులను 15 హెచ్చరిక వ్యవస్థల ద్వారా అప్రమత్తం చేస్తామని చెప్పారు. గువామ్లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.
గువామ్ సమీపంలో క్షిపణి దాడులకు విస్తృత ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా గురువారం ప్రకటించిన నేపథ్యంలో జెన్నా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గువామ్లో దాదాపు 7 వేల మంది అమెరికా భ్రదతాసిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!