ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం, 37 మంది మృతి, 137 మందికి గాయాలు
- August 11, 2017
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో 37 మంది మరణించారు. మరో 137మందికిపైగా గాయపడ్డారు.
ఈజిప్టు ఉత్తర తీరంలోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకొందని అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలిసన వెంటనే అధికారులు సహయకచర్యలను చేపట్టారు.
రెండు రైళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొందని అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్లే రాజధాని కైరో నుండి వస్తున్న రైలు ఆగి ఉంటే, మరో రైలు వచ్చి ఢీకొట్టిందని అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంఘలన స్థలం భయానక వాతావరణం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







