ఇరాన్ పై గూఢచర్యం కేసులో 12మంది అరెస్టు
- August 12, 2017
ఇరాన్ గూఢచర్యం కేసులో 12మందిని వివిధ ప్రాంతాల్లో కువైట్ అధికారులు అరెస్టు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 2015లో అబ్దాలీ సెల్పై జరిపిన దాడిలో తుపాకులు, పేలుడు పదార్థాలు కనుగొన్న తర్వాత 25మంది కువైట్ జాతీయులపై, ఒక ఇరాన్ జాతీయుడిపై కువైట్ ప్రభుత్వం అభియోగాలు మోపింది. వీరందరూ కూడా షియాలే. కువైట్కు వ్యతిరేకంగా ఘర్షణలు, గొడవలు సృష్టించేందుకు వీరు కుట్ర పన్నారని కువైట్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జైలుశిక్షలు విధించారు. గత జూన్లో కువైట్ అత్యున్నత కోర్టు ఈ మరణశిక్షను రద్దు చేసింది. వారిలో కొందరికి శిక్ష పెంచగా, మరికొందరికి తగ్గించింది. ఇరాన్ జాతీయుడితో సహా 14మందికి వారి పరోక్షంలో శిక్షలు ఖరారయ్యాయి. కాగా ఈ కేసులో తమ ప్రమేయం లేదని ఇరాన్ తిరస్కరించింది. ఇదే కేసులో దోషులైన మరో ఇద్దరి కోసం అధికారులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







