ఇరాన్ పై గూఢచర్యం కేసులో 12మంది అరెస్టు
- August 12, 2017
ఇరాన్ గూఢచర్యం కేసులో 12మందిని వివిధ ప్రాంతాల్లో కువైట్ అధికారులు అరెస్టు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 2015లో అబ్దాలీ సెల్పై జరిపిన దాడిలో తుపాకులు, పేలుడు పదార్థాలు కనుగొన్న తర్వాత 25మంది కువైట్ జాతీయులపై, ఒక ఇరాన్ జాతీయుడిపై కువైట్ ప్రభుత్వం అభియోగాలు మోపింది. వీరందరూ కూడా షియాలే. కువైట్కు వ్యతిరేకంగా ఘర్షణలు, గొడవలు సృష్టించేందుకు వీరు కుట్ర పన్నారని కువైట్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జైలుశిక్షలు విధించారు. గత జూన్లో కువైట్ అత్యున్నత కోర్టు ఈ మరణశిక్షను రద్దు చేసింది. వారిలో కొందరికి శిక్ష పెంచగా, మరికొందరికి తగ్గించింది. ఇరాన్ జాతీయుడితో సహా 14మందికి వారి పరోక్షంలో శిక్షలు ఖరారయ్యాయి. కాగా ఈ కేసులో తమ ప్రమేయం లేదని ఇరాన్ తిరస్కరించింది. ఇదే కేసులో దోషులైన మరో ఇద్దరి కోసం అధికారులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









