ఇరాన్‌ పై గూఢచర్యం కేసులో 12మంది అరెస్టు

- August 12, 2017 , by Maagulf
ఇరాన్‌ పై గూఢచర్యం కేసులో 12మంది అరెస్టు

ఇరాన్‌ గూఢచర్యం కేసులో 12మందిని వివిధ ప్రాంతాల్లో కువైట్‌ అధికారులు అరెస్టు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 2015లో అబ్దాలీ సెల్‌పై జరిపిన దాడిలో తుపాకులు, పేలుడు పదార్థాలు కనుగొన్న తర్వాత 25మంది కువైట్‌ జాతీయులపై, ఒక ఇరాన్‌ జాతీయుడిపై కువైట్‌ ప్రభుత్వం అభియోగాలు మోపింది. వీరందరూ కూడా షియాలే. కువైట్‌కు వ్యతిరేకంగా ఘర్షణలు, గొడవలు సృష్టించేందుకు వీరు కుట్ర పన్నారని కువైట్‌ ప్రాసిక్యూటర్లు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జైలుశిక్షలు విధించారు. గత జూన్‌లో కువైట్‌ అత్యున్నత కోర్టు ఈ మరణశిక్షను రద్దు చేసింది. వారిలో కొందరికి శిక్ష పెంచగా, మరికొందరికి తగ్గించింది. ఇరాన్‌ జాతీయుడితో సహా 14మందికి వారి పరోక్షంలో శిక్షలు ఖరారయ్యాయి. కాగా ఈ కేసులో తమ ప్రమేయం లేదని ఇరాన్‌ తిరస్కరించింది. ఇదే కేసులో దోషులైన మరో ఇద్దరి కోసం అధికారులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com