నేపాల్లో భారీ వరదలు, 36 మంది దుర్మరణం
- August 12, 2017
నేపాల్లో భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు 36 మంది దుర్మరణం చెందగా, 12 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వరదలకు వందలాది ఇళ్లు నీట మునగగా..వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆ దేశ హోంశాఖ పేర్కొంది.
మరోవైపు ప్రధాని షేర్ బహదూర్ దేవ్ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ సహాయక చర్యల్ని మరింత ఉధృతం చేయాలని స్థానిక, జిల్లా అధికారులను ఆదేశించింది. ఝపా, మోరంగ్, సున్సారీ, సప్టారీ, సిరాహా, సర్లాహీ, రౌతహట్, బంకే, బర్దియా, దంగ్ జిల్లాలు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నట్లు హోంమంత్రి శర్మ వెల్లడించారు. వరద నీరు చొచ్చుకురావడంతో బిరత్నగర్ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







