ట్రాయ్ కసరత్తులు మనకు శుభవార్తే
- August 13, 2017
మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ మరో తీపికబురును అందించనుంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను తగ్గించేందుకుగాను ట్రాయ్ కసరత్తు చేస్తోంది.
వివిధ ఆపరేటర్లు కాల్స్ను కనెక్ట్ చేసేందుకు వసూలు చేస్తున్న ఐసీయూను ప్రస్తుతం నిమిషానికి 14 పైసల నుండి 10 పైసలకు తగ్గించనున్నారు. కాల్ ఛార్జీలు, డేటా ప్యాక్ల ధరలు దిగివస్తున్న క్రమంలో మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ తీపి కబురును అందించేందుకు ప్రయత్నాలను చేస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్లో రిలయన్స్ జియో రాకతో మొబైల్ టారిఫ్లు ప్రభావితమైన క్రమంలో ఐసీయూ వసూలు కీలకంగా ముందుకు వచ్చింది. కష్టమర్లకు ఉచిత కాల్స్ అందించే క్రమంలో ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీలతో జియోపై పెనుభారం పడింది.
ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఛార్జీలను మరింత పెంచాలని ఎయిర్టెల్ డిమాండ్ చేస్తోంది. మొబైల్ పరిశ్రమ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మోడల్స్కు మారుతున్నందున ఛార్జీలు అవసరం లేదని రిలయన్స్ అభిప్రాయంతో ఉంది.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







