రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
- August 14, 2017
తెలుగు రాష్ట్రాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడలోని శ్రీకృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడ గులాబీ తోటలోని శ్రీకృష్ణ దేవస్థానానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. విశాఖలోనూ ఆలయాలన్నీ శ్రీ కృష్ణనామస్మరణతో మార్మోగిపోయాయి. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ఉన్న హరేకృష్ణ కమల మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నికృష్ణుల వేషధారణలోని పిల్లలు అందరినీ ఆకట్టుకున్నారు. కమల మందిరంలో మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలక్కుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
అనంతపురంలోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి పోటెత్తిన పిల్లలు, పెద్దలు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం 30 వేల భక్తులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్ అంబర్ పేటలోని ఎల్లెన్ కిండర్ గార్టెన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో పాల్గొన్న చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషాలతో సందడి చేశారు. ఉట్టి కొట్టి, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మన సంస్కృతిని పిల్లలకు తెలియజెప్పేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









