మెట్రోరైలు కు అనుగుణంగా సిటీ బస్సులు
- August 18, 2017
నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం అవుతున్న మెట్రోకు అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఏర్పాట్లు చేస్తోంది. రైలు దిగిన వెంటనే ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు బస్సులు అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోస్టేషన్ల వద్దే బస్టాపులు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నవంబర్లోగా మియాపూర్, నాగోల్ కారిడార్లు పూర్తవుతాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సిటీ బస్సులను సమకూర్చుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మియాపూర్ నుంచి అమీర్పేట, నాగోల్ నుంచి అమీర్పేట రూట్లలో అదనపు బస్సులను నడపనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి వివిధ ప్రాంతాలకు 760, మియాపూర్ నుంచి 940 సిటీ బస్సులు నడుపుతున్న టీఎ్సఆర్టీసీ మెట్రో అందుబాటులోకి వచ్చేలోపు మరిన్ని బస్సులను సమకూర్చుకునే పనిలో పడింది.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







