ప్రతిష్టాత్మకంగా మొదలైన హైదరాబాద్ మారథాన్

- August 19, 2017 , by Maagulf
ప్రతిష్టాత్మకంగా మొదలైన హైదరాబాద్ మారథాన్

ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ ప్రారంభమైంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుండగా, దేశ విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందికి పైగా రన్నర్స్‌ పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ ను  హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించగా, మారథాన్ సాగే రహదారిని పోలీసులు మూసివేశారు. ఈ పోటీలో విజతలకు 7.2లక్షల రూపాయలు బహుమతిగా అందించనుండటంతో.. కెన్యా, నైజీరియాకు చెందిన పలువురు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్ లుగా మూడు విభాగాల్లో పోటీ జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com