న్యూయార్క్ పరేడ్ లో ముఖ్య అతిథి గా రానా
- August 20, 2017
న్యూయార్క్లో ఇండియా డే పరేడ్ వేడుకలు అంబరాన్నంటాయి. దేశం బయట జరిగే అతిపెద్ద స్వతంత్ర దినోత్సవాలుగా భావించే ఈ పెరేడ్ను మిడ్ టౌన్లో నిర్వహించారు. 37వ ఆన్యువల్ ఇండియా డే పరేడ్కు న్యూయార్క్లో ఉన్న వేలాది మంది భారతీయులు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో ఆడిపాడారు.
ఇండియా డే పరేడ్ సందర్భంగా భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ రకరకాల వంటకాలు ఏర్పాటు చేశారు. పరేడ్ జరిగే మార్గం పొడవునా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వడ్డించారు. ఈసారీ ఇండియా డే పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, అరుదైన గౌరవం అందుకున్నారు.
ఇండియా పరైడ్ తో రోడ్లపై ఒక్కసారిగా జనం, శకటాలు పోటెత్తాయి. పరేడ్ సాఫీగా జరగడానికి వీలుగా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కొన్ని రూట్స్ క్లియర్ చేసింది.. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియా పరేడ్కు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు వరకూ అనుమతించింది. ఈ సందర్భంగా రకరకాల శకటాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







