న్యూయార్క్ పరేడ్ లో ముఖ్య అతిథి గా రానా
- August 20, 2017
న్యూయార్క్లో ఇండియా డే పరేడ్ వేడుకలు అంబరాన్నంటాయి. దేశం బయట జరిగే అతిపెద్ద స్వతంత్ర దినోత్సవాలుగా భావించే ఈ పెరేడ్ను మిడ్ టౌన్లో నిర్వహించారు. 37వ ఆన్యువల్ ఇండియా డే పరేడ్కు న్యూయార్క్లో ఉన్న వేలాది మంది భారతీయులు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో ఆడిపాడారు.
ఇండియా డే పరేడ్ సందర్భంగా భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ రకరకాల వంటకాలు ఏర్పాటు చేశారు. పరేడ్ జరిగే మార్గం పొడవునా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వడ్డించారు. ఈసారీ ఇండియా డే పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, అరుదైన గౌరవం అందుకున్నారు.
ఇండియా పరైడ్ తో రోడ్లపై ఒక్కసారిగా జనం, శకటాలు పోటెత్తాయి. పరేడ్ సాఫీగా జరగడానికి వీలుగా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కొన్ని రూట్స్ క్లియర్ చేసింది.. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియా పరేడ్కు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు వరకూ అనుమతించింది. ఈ సందర్భంగా రకరకాల శకటాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









