జైహింద్ నినాదం చేసిన కెనడా ప్రధానమంత్రి
- August 22, 2017
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. క్యూబెక్లో జరిగిన ఇండియా డే పరేడ్లో ఆయన పాల్గొన్నారు. పర్పుల్ కలర్ కుర్తా పైజామా ధరించి భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగం పూర్తి చేసిన తర్వాత 'జై హింద్' అని నినందించి అక్కడికి వచ్చిన వారందరి మనసులను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ద్వారా పోస్టు చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ పరేడ్లో కెనడాలోని భారత హైకమిషనర్ రాయబారి వికాస్ స్వరూప్ కూడా పాల్గొన్నారు.
కెనడా ప్రధానమంత్రి ఇండియా పరేడ్లో పాల్గొనడం పట్ల వికాస్ స్వరూప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు ట్రూడోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించడం చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. జులై నెలలో టొరంటోలోని శ్రీస్వామినారాయణ ఆలయానికి వెళ్లిన సమయంలో కూడా ట్రూడో కుర్తా పైజామాలో వచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







