ప్రముఖ నేపద్య గాయకుడు జేసుదాసు దంపతులు శబరిమల అయ్యప్పను దరిశించుకున్నారు
- August 22, 2017
ప్రముఖ నేపద్య గాయకుడు జేసుదాసు పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల దర్శనం చేసుకొన్నారు.. అయ్యప్ప స్వామి పాటలు జేసుదాసు గళం నుంచి వెలువడితేనే అవి వీనుల విందు.. అటువంటి ఏసుదాసు ఇప్పటికే శబరిమల చాలా సార్లు వెళ్లారు.. అయ్యప్ప ను దర్శించుకొన్నారు. కానీ ఈ సారి ఏసుదాసు తన భార్య ప్రభతో కలిసి వెళ్ళడం విశేషం.. ఈ దంపతులు ఇద్దరూ కలిసి స్వామిని నెయ్యి అభిషేకం చేశారు.. అంతేకాదు.. ఆలయం మూసివేసే సమయంలో ఆయన "హరివారాసనం" అనే పాను కూడా ఆలపించారు.. ఈ సందర్భంగా జేసుదాసు మాట్లాడుతూ... స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం ఇస్తుందని... చాలా ప్రశాంతంగా ఉందని.. ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేమని అన్నారు. కులం, మతం అనే ప్రసక్తి లేకుండా అందరి భక్తులను సమానంగా చూసే ఏకైక పుణ్య క్షేత్రం శబరిమల అని చెప్పారు.. కాగా జేసు దాసు అసలు పేరు ఏసుదాసు... తన పేరుని జేసుదాసు గా మార్చుకొని ఎన్నో హిందూదేవుళ్ళ భక్తి గీతాలను.. ఆలపించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







