బహ్రెయిన్ లో అంగరంగ వైభవంగా జరిగిన 'జయహో అమరావతి' శంకుస్థాపన మహోత్సవం
- October 25, 2015
బహ్రెయిన్ లో జయహో అమరావతి వేడుకలు అంగరంగ వైభవంగా తెలుగు వారు అంతా కలసి జరుపుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా డా| గజల్ శ్రీనివాస్ గారు విచ్చేసారు. జయహో అమరావతి వేదిక నలంకరించి మానవత్వం పరిమలింప చేసారు ... సమాజం లో అమ్మ, నాన్న, దేవుళ్ళు, గురువులు వాళ్ళే అని చాటి చెప్పారు. ఆయన గజల్ గానం విని పులకించిపోయారు . సమాజం లో విలువలు చాలా అవసరం అని చాటి చెప్పారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను దేశ విదేశాల లో జరుపు కోవడం చాలా ఆనందం ఇస్తుంది అని అన్నారు . అమరావతి చరిత్ర పుటలులో నిలుస్తుంది అని అన్నారు . ఈ కార్యక్రమానికి వెన్నుముఖ అయినటువంటి శ్రీ R.v.రావు గారు మరియు హరిబాబు గారిని అందరూ అభినందించారు. ప్రపంచము లో ఎవరికీ రాని ఆలోచన తీసుకొని వచ్చి జయహో అమరావతిని తెలుగు ప్రజల మధ్య జయహో అనిపించారు. బహ్రెయిన్ ని శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాచంద్ర బాబు నాయుడు గారు అభినందించారు . ఇలాగే దేశ విదేశాలలో ఉన్న తెలుగువారంతా నవ్యాంధ్ర ప్రదేశ్ కోసం పాటుపడాలి అని అన్నారు.మన భవిష్యత్ అమరావతిని దిశ దశ మారుస్తుంది అని అన్నారు. జయహో అమరావతి కార్యక్రమము లో తెలుగు వారు అంతా ప్రాంతాలు కి అతీతంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమము విజయవంతం చేశారు.సభా ప్రాంగాణంలో ప్రేక్షకులు కరతాళ ధ్వనులు మధ్య జన గణ మన చెప్పి ముగించారు.
ఇందు లో మా ప్రతినిధి వాసుదేవ రావు గారు పాలు పంచుకున్నారు. తెలుగు జాతి నిండుగ వెలుగ జాతి అన్నారు.
ఈ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







