దుబాయ్ మెట్రో స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య
- August 23, 2017
దుబాయ్లోని మెట్రో స్టేషన్లో ఉగాండాకి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నూర్ బ్యాంక్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎస్కలేటర్ పైనుంచి వెళుతుండగా, భారీ శబ్దం విన్పించిందనీ, చూసేసరికి రక్తపు మడుగులో ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనతో కాస్సేపు మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అనంతరం సర్వీసులు యధాతథంగా కొనసాగాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







