దుబాయ్ మెట్రో స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య
- August 23, 2017
దుబాయ్లోని మెట్రో స్టేషన్లో ఉగాండాకి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నూర్ బ్యాంక్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎస్కలేటర్ పైనుంచి వెళుతుండగా, భారీ శబ్దం విన్పించిందనీ, చూసేసరికి రక్తపు మడుగులో ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనతో కాస్సేపు మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అనంతరం సర్వీసులు యధాతథంగా కొనసాగాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







