మెయిన్టెనెన్స్ వర్క్షాప్లో అగ్నిప్రమాదం
- August 23, 2017
అబుదాబీలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో బోటు దగ్ధమైంది. అబుదాబీలోని మెరినీ అల్ బతీన్లోని మెయిన్టెనెన్స్ వర్క్షాప్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రమాదంలో ఘటన జరిగినట్లు సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ నుంచి టీమ్స్ బయల్దేరి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు సివిల్ డిఫెన్స్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వర్క్షాప్లు, వేర్హౌస్లు, ఫ్యాక్టరీల నిర్వాహకులు భద్రత విషయంలో రాజీపడరాదనీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







