జీతాల చెల్లింపుపై ఎంఓఎం, సిబిఓ జాయింట్ మానిటరింగ్
- August 24, 2017
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ (ఎంఓఎం), ప్రైవేటు సంస్థల నుంచి డాటాను తెప్పించుకుంటోంది. సేలరీ ట్రాన్స్ఫర్స్, వేతనాల చెల్లింపులో ఆలస్యం వంటి అంశాలను విశ్లేషించేందుకే ఈ చర్యలు చేపడుతోంది. ఎంఓఎం అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సంయుక్తంగా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన డేటాను మానిటర్ చేయడం జరుగుతుంది. జీతాల చెల్లింపులు, వేతనాల ఆలస్యానికి సంబంధించి సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మానిటరింగ్, కార్మికుల మేలు కోసమేనని అధికారులు వెల్లడించారు. వేతన బకాయిలకు సంబంధించి కార్మికులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారుతుండడం ఒక్కోసారి కంపెనీలు కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపడుతుండడంతో మినిస్ట్రీ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సమస్య తీవ్రతను ముందే గుర్తించడానికి ఈ మానిటరింగ్ వ్యవస్థ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







