తన కవితలతో కలల రాకుమారుడు ఫిదా..నటి రేణూ దేశాయ్
- August 26, 2017
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అభిమానుల్ని పలకరిస్తుంటుంది. తనకు సంబంధించిన ఏదో ఒక ఇంట్రస్టింగ్ న్యూస్తో అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంటుంది. పవన్ తనూ విడిపోయినా తన మాటల ద్వారా పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని,ప్రేమని తరచూ వ్యక్తం చేస్తూనే ఉంటుంది. తాజాగా రేణు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తి కర విషయాలు వెల్లడించింది. చిన్నప్పటి నుంచి తనకు కవితలు, చిన్న చిన్న స్టోరీలు రాసే అలవాటు ఉందని.. కొంత కాలంగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని తెలిపింది. అంతేకాదు తను రాసిన వాటికి ఫస్ట్ రీడర్ పవన్ కళ్యాణ్ అంటూ, పవన్ తనని ఇష్టపడడంతో పాటు, తన రైటింగ్స్ని ఎంతో ప్రోత్సహించేవారని తెలిపారు. 2014 నుంచి కవితలు రాస్తున్నానని, 2015లో తాను అనారోగ్యానికి గురైనప్పుడు చాలా కవితలు రాశానని, కొంతకాలాని వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేశానని అన్నారు. ప్రస్తుతం మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్న రేణూ, సెకండ్ ఇన్నింగ్స్లో దర్శకురాలిగా, నిర్మాతగా రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







