తనిష్క్ రెడ్డి నటిస్తున్న దర్పణం షూటింగ్ ప్రారంభం
- August 27, 2017
తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగీ పంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దర్పణం'. శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ కుమార్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 'దర్పణం' షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి రచయిత శివ శక్తిదత్తా, దర్శకులు శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తొలి సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. చిత్ర ప్రారంభోత్సవ అనంతరం నిర్మాత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.'దర్పణం నా మొదటి చిత్రం. కథ ఎంతగానో నచ్చింది. మంచి ప్రేమ కథ. ప్రతి యువతీ యువకులు తమను కథలో చూసుకుంటారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాం.' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - సిద్దార్థ్ సదాశివుని, సినిమాటోగ్రఫీ - సతీష్ ముత్యాల, స్టంట్స్ - మల్లేష్, ఎడిటర్ - ఈఎస్ ఈశ్వర్, సహ నిర్మాతలు - కేశవ్ దేశాయ్, క్రాంతి కిరణ్ వెల్లంకి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







