హజ్ యాత్ర కోసం జెడ్డా చేరుకొన్న104 ఏళ్ల వృద్ధురాలు
- August 27, 2017
ఈ సంవత్సరం ఇండోనేషియా నుంచి వచ్చిన 220,000 హజ్ యాత్రికుల్లో అందరికన్నా పెద్ద వయస్సు ఉన్న బాయిక్ మారియా అనే వృద్ధురాలు కావడం విశేషం. మక్కా యాత్రికురాలిగా సర్వోన్నుతుడైన దేవుడు మరోమారు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు "ఆల్హాదులిల్లాహ్ (దేవునికి స్తోత్రము), నేను మక్కా, అల్మ్దులిల్లాహ్ కు హాజరవుతున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు, తెల్లగా మెరిసిపోయే ఇస్లామిక్ దుస్తులు ధరించిన ఆ వృద్ధ మహిళ గతంలో 90 సంవత్సరాల వయస్సులో మక్కాకు ఉమ్రా యాత్రకు వచ్చింది. ఈ రోజు వరకు, సౌదీ రాజ్యంలో 1.5 మిలియన్లకు పైగా యాత్రికులు వచ్చారని పేర్కొన్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 4 వరకు ఈ ఏడాది హాజరు కానున్న సుమారు రెండు లక్షల మంది యాత్రికులు ఈ సంవత్సరం హాజరవుంటారు. ఈ సంవత్సరం హజ్లో యాత్రికులు 80 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జెడ్డా లోని ఇండోనేషియా రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ హెరి సరిపుద్దిన్ మాట్లాడుతూ, బాయిక్ మరియా మంచి ఆరోగ్యంతో ఉందని మరియు హజ్ ఆచారాలను ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేయగలనని ఆమె సంతోషంగా తెలిపిందన్నారు..ఆమె ఇండోనేషియా నుండి వచ్చేటప్పుడు ఆమెకు తోడుగా ప్రత్యేక సహాయం అందించారు. కొందరు అధికారులు ఆమె సురక్షితమైన మరియు మృదువైన విమాన ప్రయాణం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. అలాగే ఆమె కోసం సౌదీ అరేబియాలో స్థానిక అధికారులచే ప్రత్యేక సహాయంతో మరియాకు అందించారు. ఇండోనేషియాలో హజ్ ను నిర్వహించడానికి లక్షలాదిమంది ముస్లింలు ఎదురుచూసేరని మొహమ్మద్ హెరి సరిపుద్దిన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







