నైజీరియాలో రెచ్చిపోయిన టెర్రరిస్టులు

- August 27, 2017 , by Maagulf
నైజీరియాలో రెచ్చిపోయిన టెర్రరిస్టులు

నైజీరియాలో ముస్లిం తీవ్రవాద సంస్థ బొక హరామ్ విరుచుపడింది. గ్రామాలపై తీవ్రవాద సంస్థ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రామాలపై విరుచుకుపడి ఏకంగా 27మంది అమాయక పౌరులను హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎన్గాన్‌జయి, గుజామల గ్రామాలపై బొకోహరామ్‌ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో 15 మంది పౌరుల గొంతులు కోశారు. మరికొందరిని చిత్రహింసలు పెట్టి కాల్పులు జరిపారు. స్థానికుల ఇళ్లకు సైతం మంటలు పెట్టి పైశాచిక పర్వం కొనసాగించారు. ఈ దుర్ఘటన అనంతరం సైన‍్యం ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com