సిమెంట్ ఆన్‌లైన్ అమ్మకాలు

- October 26, 2015 , by Maagulf
సిమెంట్ ఆన్‌లైన్ అమ్మకాలు

సిమెంట్ ఆన్‌లైన్ అమ్మకాలను రిలయన్స్ సిమెంట్ కంపెనీ (ఆర్‌సీసీ) ప్రారంభించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మూడు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభించిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఈ-టైలింగ్ సౌలభ్యం తదుపరి దశల్లో విస్తరిస్తామని ఆయన తెలిపారు. కనీసం 25 బ్యాగులు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 48 గంటల్లో లోడ్ డెలివరీ అవుతుంది. సంస్థకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కర్మాగారాలు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.5 మిలియన్ టన్నులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com