803 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష

- August 28, 2017 , by Maagulf
803 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష

అబుదాబీ: ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ఈద్‌ అల్‌ అదా సందర్భంగా 803 మంది ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. పలు కేసుల్లో వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయా ఖైదీలకు సంబంధించి సెటిల్‌మెంట్స్‌, ఫైనాన్షియల్‌ ఆబ్లిగేషన్స్‌ విషయమై ఖలీఫా వివిధ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు అందించారు. తెలిసో తెలియకో చేసిన తప్పుల కారణంగా జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలకు ఈ క్షమాభిక్ష ప్రసాదించడం ద్వారా తిరిగి వారు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా మారేందుకు అవకాశం లభిస్తుందని, ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపడంలో భాగంగా ఖలీఫా పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com