తెలంగాణాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య : డీఈవో

- August 29, 2017 , by Maagulf
తెలంగాణాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య : డీఈవో

జిల్లాలో పనిచేస్తూ అక్రిడిటేషన్‌ కలిగి ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చదివేందుకు ఉచిత విద్య అవకాశం కలిపిస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. అర్హులైన జర్నలిస్టు పిలల్లకు ఉచిత విద్యనందించేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ శ్రీదేవసేన సూచనల మేరకు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లల వివరాలు డీఈవో కార్యాలయంలో అందించాలని తెలిపారు. ఏయే పాఠశాలలో చదువుతున్నది, చదువుతున్న తరగతుల వివరాలు, ఆధార్‌ కార్డ్‌, జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డు జిరాక్స్‌ ఆయాస్కూళ్లలో అందించాలని ఆయన సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com