కొడుకును డైరెక్ట్ చేయబోతున్నతండ్రి పూరి జగన్నాధ్
- August 31, 2017
పైసా వసూల్ మూవీ ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్న పూరి , ఈ మూవీ తర్వాత ఎవరితో చేస్తాడా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ , మహేష్ బాబు లతో సినిమాలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న పూరి మాత్రం వారథి కాకుండా తన తనయుడు ఆకాష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని వినికిడి. బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్ , ఆంధ్రపోరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడం తో ఆకాష్ కు హీరోగా గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం ఆకాష్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ , డాన్స్ మొదలగునవి వాటిని ఆకాష్ నేర్చుకునే పనిలో ఉన్నాడట. ఇటు పూరి కూడా తన తనయుడికి సరిపోయే కథని రెడీ సిద్ధం చేసాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూవీ కి సంబదించిన పూర్తి వివరాలు పైసా వసూల్ రిలీజ్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







