ముంబయిలో ఘోరం భవనం కూలి 10 మంది మృతి
- August 31, 2017
ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భిండి బజార్ ప్రాంతంలో గురువారం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహా 15 మంది గాయపడగా.. మరో 25 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఉదయం 8.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో తొమ్మిది కుటుంబాలు నివసిస్తున్నాయని అగ్నిమాపక విభాగ అధికారులు తెలిపారు. భవనంలో ఓ ప్లేస్కూల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉదయమే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ భవనం 50ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.
కాగా.. ముంబయిలో మంగళవారం భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో వరదలు సంభవించి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా ముంబయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







