'పైసా వసూల్' చిత్రం చూస్తూ అభిమానులతో సందడి చేసిన బాలయ్య
- August 31, 2017
ఈ మద్య ఒక సినిమా రిలీజ్ కావడానికి ముందు నుంచి ఆ సినిమాపై విపరీతమై అంచనాలు పెంచుతున్నారు చిత్ర యూనిట్. ఇందుకోసం డైరెక్టర్,హీరో, హీరోయిన్లు కూడా ప్రమోషన్ వర్క్ లో తమదైన స్టైల్ చూపిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం వివిధ చానల్స్ లో చిట్ చాట్ చేస్తూ సినిమా షూటింగ్ విశేషాలు..అభిప్రాయాలు చెబుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.
తాజాగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రియ జంటగా నటించిన 'పైసా వసూల్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెంచుతూ వచ్చారు..ఖమ్మంలో ఆడియో రిలీజ్..ఫ్రీరిలీజ్ ఫంక్షన్ రోజు బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఈ రోజు 'పైసా వసూల్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలో నటసింహం నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. బాలయ్య భ్రమరాంబ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ, ఛార్మితో పాటు అభిమానుల సమక్షంలో మూవీని తిలకించారు.
తమ అభిమాన హీరో బాలయ్య సినిమా చూడటానికి వచ్చాడని తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ అక్కడ తెగ హల్ చల్ చేశారు. థియేటర్ దగ్గర కనిపించడంతో అభిమానులు ఉత్సాహాంగా కేరింతలు, ఈలలు వేసి గోల గోల చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







