వరదలో వచ్చిన నీటిలోని చేపలను వండుకొని తింటున్న టెక్సాస్ ప్రజలు

- September 01, 2017 , by Maagulf
వరదలో వచ్చిన నీటిలోని చేపలను వండుకొని తింటున్న టెక్సాస్ ప్రజలు

 హరికేన్‌ హార్వే బీభత్సానికి అమెరికా అతలాకతులమైంది.. టెక్సాస్‌ రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. హరికేన్ హార్వే ప్రభావంతో టెక్సాస్‌లోని అనేక ప్రాంతాలతు సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరగా.. 35 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా హరికేన్‌ హార్వే మిగిలిపోయింది. ఈ పెనుతుపాను బీభత్సానికి లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కాగా తినడానికి తిండి లేని టెక్సాస్ జనం ఇంట్లోనే చేపలను పట్టుకొని తింటున్నారు.. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నది.. కాగా ప్రవాస భారతీయులు, డాక్టర్లు.. వరద బాధితులకు తిండి, వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com