5,000 మంది యాత్రికులకు జంతువుల బలికి అయ్యే ఖర్చును కింగ్ సల్మాన్ భరిస్తారు

- September 01, 2017 , by Maagulf
5,000 మంది యాత్రికులకు జంతువుల బలికి అయ్యే ఖర్చును కింగ్ సల్మాన్ భరిస్తారు

హజ్ కార్యక్రమంలో 5,000 మంది యాత్రికులకు జంతువుల త్యాగంకు అయ్యే ఖర్చును  కింగ్ సల్మాన్ భరించనున్నారు.హజ్జ్ అతిథి కార్యక్రమంలో భాగంగా ఆ ఖర్చు చేస్తారని అధికారి తెలిపారు. ఈ అవకాశాన్ని హజ్ మరియు ఉమ్రా కోసం వచ్చిన   కింగ్ సల్మాన్ యొక్క అతిథులతో పాటు 80 కన్నా ఎక్కువ దేశాల నుండి యాత్రికులు ఉన్నారని ఈ కార్యక్రమాల జనరల్ డైరెక్టర్  అబ్దుల్లా బిన్ ముద్లాజ్ అల్ ముద్లాజ్ తెలిపారు. . ఈ కార్యక్రమంలో పాలస్తీనా, ఈజిప్టియన్ సైన్యం మరియు పోలీసులు, అలాగే నిర్ణయాత్మక మరియు పునరుద్ధరణ చేసే  ఆపరేషన్లలో చంపబడిన సుడానీస్ సైనిక సిబ్బంది బంధువులు ఉన్నారు.లబ్ధిదారుల సంఖ్య గత ఏడాది 2,400  ఉంటె ఈ హజ్ సీజన్ 5,000 మంది లబ్ధిదారుల సంఖ్య ఉంది. కార్యక్రమం యొక్క కార్యనిర్వాహక కమిటీ సంబంధిత సంస్థలతో సమన్వయంతో ఈ ప్రతిపాదనను అమలు చేయడం ప్రారంభించింది, అన్ని లబ్ధిదారులకు హజ్జ్ అతిథి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఇస్లామిక్ వ్యక్తులతో సమన్వయంతో ఉంది.జంతువుల బలికి అయ్యే ఖర్చు రాజు భరించడం ద్వారా కతర్  జాతీయులు సహా అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల్లోని రాజ్యాలకు మరియు ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com