ఈద్‌ అల్‌ అదా ప్రార్థనలు నిర్వహించిన రూలర్స్‌

- September 01, 2017 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా ప్రార్థనలు నిర్వహించిన రూలర్స్‌

 ఊఏఈ వ్యాప్తంగా రూలర్స్‌ ఈద్‌ అల్‌ అదా ప్రార్థనల్ని శుక్రవారం నిర్వహించారు. 'ఫీస్ట్‌ ఆఫ్‌ శాక్రిఫైజ్‌' సందర్భంగా ఈ ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. సుప్రీం కౌన్సిల్‌ మెంబర్స్‌, ఎమిరేట్స్‌ రూలర్స్‌ ఈద్‌ అల్‌ అదా ప్రార్థనల్ని తమ తమ ఎమిరేట్స్‌లో పలు మసీదుల్లో నిర్వహించడం జరిగింది. ముస్లిం సమాజానికి ఈద్‌ ఎంతో ఆనందోత్సాహాలకు నెలవైన పండుగ. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ సంబరాల్లో పాలుపంచుకున్నారు. దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ జబీల్‌ మాస్క్‌లో ఈద్‌ అల్‌ అదా ప్రార్థనలు నిర్వహించారు. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కూడా షేక్‌ మొహమ్మద్‌తో కలిసి ఈద్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. షార్జా రూలర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌, అల్‌ బదీయా మాస్క్‌లో ప్రార్థనలు నిర్వహించగా, అజ్మన్‌ రూలర్‌ షేక్‌ హుమైద్‌ అల్‌ నౌమి - రషీద్‌ బిన్‌ హుమైద్‌ అల్‌ నౌమి మాస్క్‌లో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఉమ్‌ అల్‌ ఖైవాన్‌ షేక్‌ సౌద్‌ అల్‌ ముల్లా, రస్‌ అల్‌ ఖైమా రూలర్‌ షేక్‌ సౌద్‌ అల్‌ ఖాసిమి, ఫుజారియా రూలర్‌ షేక్‌ హమాద్‌ అల్‌ షర్కి కూడా తమ తమ ఎమిరేట్స్‌లోని మసీదుల్లో ప్రత్యేక ఈద్‌ ప్రార్థనల్ని నిర్వహించారు. వీరి వెంట పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com