కన్నడిగరు యూకే సంస్థ' ఆధ్వర్యంలో ఈనెల 18న లండన్లో కన్నడ ఉత్సవం
- September 01, 2017
'కన్నడిగరు యూకే సంస్థ' ఆధ్వర్యంలో ఈనెల 18న లండన్లో కన్నడ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు గణేశ్భట్ వెల్లడించారు. లండన్లో కన్నడిగులు సమైక్యంగా జీవించడం కోసమే 'కన్నడిగరు యూకే' పేరిట సంస్థను ప్రారంభించామని గణేశ్భట్ బెంగళూరులో శుక్రవారం ప్రకటించారు. కన్నడ సంస్కృతికి అనుబంధంగా లండన్లో తరచూ కార్యక్రమాలు, సినిమాల ప్రదర్శనలు చేపడుతుంటామన్నారు. సమాజ సేవకులకు, ధార్మిక సంస్థలకు తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. పదేళ్లుగా కన్నడ ఉత్సవాన్ని జరుపుతున్నామన్నారు. యూకే వ్యాప్తంగా ఉండే కన్నడిగులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. కళాకారుడు మండ్య రమేశ్, తుళు ప్రాంత హాస్యకళాకారుడు నవీన్, గాయకుడు గోనాస్వామి, మహదేవ్శెట్టిగిరి, అరళుప్రతిభ, దిశా రమేశ్లు పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







