'కబాలి' షూటింగ్ కోసం మలేషియా వెళ్ళిన రజని
- October 28, 2015
సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యానియాతో మలేషియా ఎయిర్ పోర్ట్ దద్దరిల్లి పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న 'కబాలి'షూటింగ్ కోసం మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కిన దగ్గర నుంచి ఈహడావిడి ప్రారంభం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీని విమానంలో చూసిన వెంటనే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులతో పాటు ఆ విమానాన్ని నడుపుతున్న పైలెట్ కో పైలెట్ తో సహా ఆ విమాన సిబ్బంది అంతా రజనీకాంత్ తో సెల్ఫీలు తీయించు కోవడానికి ఎగబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా రజనీకాంత్ మలేషియన్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అక్కడ సామాన్య ప్రయాణీకులు కూడ రజినీకాంత్ ను గుర్తుపట్టి రజనీ చుట్టూ చేరడంతో రజినీకాంత్ ను ఆ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు తీసుకు రావడానికి అతడి సన్నిహితులు సినిమా యూనిట్ వారు నానా పాట్లు పడినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ మలేషియా వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కౌలాలంపూర్ గవర్నర్ రజినీకాంత్ ను తన గవర్నరు బంగళాకు ప్రత్యేకంగా ఆహ్వానించి రజినీతో లంచ్ చేయడం మలేషియా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలదు అన్నట్లుగా రజినీకాంత్ తాను బస చేస్తున్న హోటల్ గది వద్దకు అసంఖ్యాకంగా అభిమానులు గుమిగూడటంతో ఆ హోటల్ సిబ్బందికి రజినీ రాక సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' లో మరో హీరోయిన్ గా నటించడానికి ఐశ్వర్యరాయ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీ రిక్వెస్ట్ చేయడంతో ఐశ్వర్య ఈపాత్రకు ఓకె చెప్పిందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈమె పాత్ర ఈ సినిమా సెకండాఫ్లో కనిపిస్తుందని అంటున్నారు. దీనితో ఈసినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తికాగా ఇప్పుడు మలేషియాలో షూటింగ్ మొదలు పెడుతున్నారు. మలేషియాలో రజనీ పై యాక్షన్ సీన్స్ని డైరెక్టర్ రంజిత్ తెరకెక్కిస్తున్నాడట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వైపు డాన్గా, మరోవైపు పోలీసు ఆఫీసర్గా రజనీకాంత్ కనిపిస్తాడట. అసలు విషయాలు తెలియాలి అంటే ఈసినిమా రిలీజ్ వరకు ఆగాలి.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







