అల్సర్ను అరికట్టే బాదం..!
- September 04, 2017
ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, అకాలభోజనం వంటి కారణాలతో అల్సర్ ఏర్పడుతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా.. ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోవడం అల్సర్కు కారణమవుతుంది.
అల్సర్తో ఇబ్బందులు పడే వారు బాదం పప్పుతో చేసే ఔషధాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బాదం పొడి, నెయ్యి, పాలు, పంచదారను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే అల్సర్ నయం అవుతుంది. ఉదరంలో ఆమ్లాలను తగ్గిస్తుంది.
అలాగే సగ్గుబియ్యంతో గొంతులో మంటను దూరం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెరుగు, ఉప్పును తీసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో కాసింత ఉప్పు, పులుపెక్కని పెరుగును చేర్చి..బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ పూట తీసుకుంటే అల్సర్తో ఏర్పడే గొంతు మంటను దూరం చేసుకోవచ్చు. యూరీనల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. సగ్గుబియ్యం ఉదర సంబంధిత రుగ్మతలను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







