అల్సర్ను అరికట్టే బాదం..!
- September 04, 2017ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, అకాలభోజనం వంటి కారణాలతో అల్సర్ ఏర్పడుతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా.. ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోవడం అల్సర్కు కారణమవుతుంది.
అల్సర్తో ఇబ్బందులు పడే వారు బాదం పప్పుతో చేసే ఔషధాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బాదం పొడి, నెయ్యి, పాలు, పంచదారను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే అల్సర్ నయం అవుతుంది. ఉదరంలో ఆమ్లాలను తగ్గిస్తుంది.
అలాగే సగ్గుబియ్యంతో గొంతులో మంటను దూరం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెరుగు, ఉప్పును తీసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో కాసింత ఉప్పు, పులుపెక్కని పెరుగును చేర్చి..బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ పూట తీసుకుంటే అల్సర్తో ఏర్పడే గొంతు మంటను దూరం చేసుకోవచ్చు. యూరీనల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. సగ్గుబియ్యం ఉదర సంబంధిత రుగ్మతలను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్