"మిస్ ఇండియా సౌతాఫ్రికా" ది మా బందరే
- September 04, 2017
ఇటీవల మిస్ ఇండియా - సౌతాఫ్రికా గాటెంగ్ టైటిల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు టెక్కీ విజయం సాధించింది, టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అద్దేపల్లి శ్రీశుభ (25) అనే యువతి పాల్గొంది. ఈమె దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్యాంకులో ఐటీ స్పెషలిస్టుగా పని చేస్తోంది. వైజాగ్లోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
కాగా, ఈ టైటిల్ పోటీల్లో శ్రీశుభ అన్ని విభాగాలతోపాటు డ్యాన్స్లో కూడా అద్వితీయమైన ప్రతిభ కనబరిచి జ్యురీ ప్రశంసలు పొందారు. భారత్లో పుట్టిన యువతి మిస్ ఇండియా దక్షిణాఫ్రికాను గెలుచుకోవడం ఇది రెండోసారి. 2009లో టైటిట్ గెలుచుకున్న ఆయుషి చాబ్రా న్యూయార్క్లో ప్రముఖ మోడల్, నటిగా పేరుగాంచిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









