ఏడుగురు తెలంగాణ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు
- September 05, 2017
తెలంగాణ నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ''నేషనల్ అవార్డ్స్ టూ టీచర్స్-2017''కు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారికి అవార్డులను అందజేశారు. ప్రాథమిక ఉపాధ్యాయులు కిషన్ (పాతఎల్లాపూర్, నిర్మల్), కె.జనార్దన్ (శివన్నగూడ, నల్గొండ), ఎం.నారాయణ (పల్కపల్లి, నాగర్కర్నూల్), ఎన్.విజయలక్ష్మి (కుల్సాపూర్, నిజామాబాద్)తోపాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యోగేశ్వర్ (మంచిర్యాల), కె.సురేందర్ (జగిత్యాల), రామారావు (ఎన్కూరు, ఖమ్మం) అవార్డులను స్వీకరించారు. కేంద్ర మంత్రి ప్ర కాశ్ జవదేకర్, సహాయమంత్రులు సత్యపాల్సింగ్, ఉపేంద్ర కుశ్వాహా పాల్గొన్నారు. కాగా, అవార్డులు పొందిన వారు సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







