రక్షణశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న నిర్మలా సీతారామన్

- September 07, 2017 , by Maagulf
రక్షణశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న నిర్మలా సీతారామన్

 నిర్మలా సీతారామన్ రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం తర్వాత జపాన్‌లో కీలక ఒప్పందాలు ఉండడంతో అరుణ్ జైట్లీ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో వెంటనే బాధ్యతలు తీసుకోవడం కుదరలేదు. ఇప్పుడు బాధ్యతలు చేపట్టడంతో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టగానే అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్రమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల సంక్షేమానికి కృషి చేస్తానని నిర్మల చెప్పారు. తనకు కీలకమైన శాఖ అప్పగించారని, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని నిర్మలా సీతారామన్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com