రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి

- September 07, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి

జెడ్డా: ఈద్‌ అలా సెలవుల సందర్భంగా రియాద్‌ నుంచి అభాకి వెళుతున్న ఓ భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రియాద్‌లోని టెలి కమ్యూనికేషన్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీలో పనిచేస్తోన్న అబ్దుల్‌ రెహ్మాన్‌, తన భార్య ఖుఱ్సీద్‌ బానుతో కలిసి అభాకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ రెహ్మాన్‌, ఖుఱ్సీద్‌ బాను, వారి కుమార్తె ఫౌజియా అక్కడికక్కడే చనిపోయారు. వారి కుమారుడు ముజాఫర్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ పూర్తి చేయడం కోసం వారి సన్నిహితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కి చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌, బెంగళూరుకి చెందిన ఖుర్షీద్‌ని వివాహం చేసుకున్నారు కొన్నేళ్ళ క్రితం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com