తగ్గుముఖం పడుతున్న పసిడి మరియు వెండి ధరలు

- September 07, 2017 , by Maagulf
తగ్గుముఖం పడుతున్న పసిడి మరియు వెండి ధరలు

వరుసగా మూడు రోజుల పాటు పెరుగుతూ ఏడాది గరిష్ఠ స్థాయిని అందుకున్న పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. రూ.190 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,360కి చేరుకుంది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. వెండి ధర రూ.100 తగ్గి రూ.42వేల మార్కు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ ఆశించిన మేర లేకపోవడంతో ధర తగ్గినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా బంగారం ధర 0.44శాతం తగ్గడంతో ఔన్సు 1,333.50 డాలర్లు పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com