తగ్గుముఖం పడుతున్న పసిడి మరియు వెండి ధరలు
- September 07, 2017
వరుసగా మూడు రోజుల పాటు పెరుగుతూ ఏడాది గరిష్ఠ స్థాయిని అందుకున్న పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. రూ.190 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,360కి చేరుకుంది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. వెండి ధర రూ.100 తగ్గి రూ.42వేల మార్కు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ ఆశించిన మేర లేకపోవడంతో ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా బంగారం ధర 0.44శాతం తగ్గడంతో ఔన్సు 1,333.50 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







